టీచర్ల బదిలీలు, పదోన్నతుల జీవో విడుదల

హైదరాబాద్ (జనవరి – 26) : తెలంగాణ రాష్ట్రంలో జనవరి 27 నుంచి టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో నంబర్ 5ను ఈరోజు జారీ చేశారు.

వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు, మాన్యువల్ గా పదోన్నతులు జరగనున్నాయి. రేపు కేటగిరీ ఖాళీలు, ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి అర్హులైన స్కూల్ అసిస్టెంట్స్ సీనియారిటీ జాబితాలు ఆన్లైన్ లో ప్రకటిస్తారు.

28 నుంచి 30 వరకు బదిలీల కోసం ఆన్లైన్ లో దరఖాస్తులను సమర్పించాలి. దరఖాస్తుల హార్డ్ కాపీలను ఉన్నత పాఠశాలల సంబంధిత ప్రధానోపాధ్యాయులకు ప్రభుత్వ, ప్రాథమికోన్నత టీచర్లు సంబంధిత ఎమ్ఎస్ఈవోలకు.. పరిషత్ ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉపాధ్యాయులు సంబంధిత కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు.. హైస్కూల్ డీఈవోకు.. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి లోపు సమర్పించాలి

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @