కొత్తగూడెం (జనవరి – 31) : సింగరేణిలో 558 ఉద్యోగాలను భర్తీకి ఫిబ్రవరి మొదటి వారంలోగా నోటిఫికేషన్ జారీ చేస్తామని సంస్థ డైరెక్టర్ ఎస్. చంద్రశేఖర్ తెలిపారు. 277 పోస్టులను నిరుద్యోగ అభ్యర్థులతో.. మిగిలిన 281 పోస్టులను అంతర్గత నియామకాల ద్వారా భర్తీ చేస్తారు.
◆ పోస్టుల వివరాలు :
30 అసిస్టెంట్ ఇంజినీర్ (ఈ 2 గ్రేడ్- ఈ అండ్ ఎం),
20 జూనియర్ ఇంజినీర్ (ఈ 1 గ్రేడ్- ఈ అండ్ ఎం),
4 అసిస్టెంట్ ఇంజినీర్ (ఈ 2 గ్రేడ్-సివిల్),
4 జూనియర్ ఇంజినీర్ (ఈ 1 గ్రేడ్-సివిల్),
11 వెల్ఫేర్ ఆఫీసర్ ట్రైనీ (ఈ 1 గ్రేడ్),
4 ప్రోగ్రా మర్ ట్రైనీ (ఈ 1 గ్రేడ్),
20 జూనియర్ కెమిస్ట్ లేదా జూని యర్ టెక్నికల్ ఇన్స్పెక్టర్,
114 ఫిట్టర్ ట్రైనీ (కేటగిరీ-1),
22 ఎలక్ట్రిషియన్ ట్రైనీ (కేటగిరీ-1),
43 వెల్డర్ ట్రైనీ (కేటగిరీ-1),
5 శానిటరీ ఇన్స్పెక్టర్ (కేటగిరీ-డి) పోస్టులకు అంతర్గత నియామకాలు చేపడతారు.
30 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు; మేనేజ్మెంట్ ట్రైనీలు.. మైనింగ్ (79); ఎలక్ట్రికల్, మెకానికల్ (66), సివిల్ (18), ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ (10), ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ (18), ఐటీ (7), హైడ్రోజియాలజిస్ట్ (2), పర్సనల్ (22)తో పాటు 3 జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్, 10 జూనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్, 16 సబ్ ఓవర్సీర్ ట్రైనీ (సివిల్) పోస్టుల భర్తీకి నిరుద్యోగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించి రాతపరీక్ష నిర్వహిస్తారు.