BIKKI NEWS : RYTHU BANDHU NEW GUIDELINES 2024. రైతు బంధు పథకంలో వచ్చే వానాకాలం నుంచి కొత్త సంస్కరణలు అమల్లోకి వస్తాయని భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉందని తెలిసింది. తాజాగా ప్రజాభిప్రాయ సేకరణ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గరిష్టంగా 10 ఎకరాల లోపల ఉన్న రైతులకు రుణమాఫీ చేయాలనే డిమాండ్ వచ్చినట్లు సమాచారం.
RYTHU BANDHU NEW GUIDELINES 2024
రైతు బంధు పథకం ఇంతకు ముందు భూమి ఉన్న ప్రతి ఒక్కరికీ వారీ హోదా, ఉద్యోగం, ఆదాయం తో పని లేకుండా చెల్లింపు చేసేవారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం సాగు చేసే రైతులకు మరియు కౌలు రైతులకు మాత్రమే రైతు బంధు అమలు చేస్తామని హమీ ఇచ్చింది. గతంలో ఇచ్చిన 10 వేలకు బదులు 15 వేలు ఇస్తామని ప్రకటించారు. అయితే పలు నిబంధనలు పెట్టే అవకాశం ఉంది.
నిబంధనలు విధించే అవకాశం
- 10 ఎకరాల లోపు రైతులకు మాత్రమే
- ప్రభుత్వ ఉద్యోగులకు రైతుబంధు నిలిపివేత
- ఆదాయ పన్ను చెల్లింపుదారులకు రైతుబంధు నిలిపివేత
- వ్యవసాయం చేయని రైతులకు రైతుబంధు నిలిపివేత
- సెలబ్రిటీలకు రైతుబంధు నిలిపివేత
- రాజకీయ నాయకులకు రైతుబంధు నిలిపివేత వంటి నిబంధనలు పెట్టే అవకాశం ఉంది
- లే అవుట్లు వేసిన భూములకు రైతు భరోసా నిలిపివేత
రాష్ట్రంలో రైతుబంధు పథకం 2018 వానాకాలం సీజన్ నుంచి ప్రారంభమైంది. మొదట్లో ఒక్కో సీజన్లో ఎకరాకు రూ.4 వేల చొప్పున.. ఏటా రూ.8 వేల చొప్పున రైతులకు అందేవి. తర్వాత ప్రభుత్వం ఈ సొమ్మును ఏడాదికి రూ.10 వేలు చేసింది. 2018 వానాకాలం సీజన్లో 1.30కోట్ల ఎకరాలకు చెందిన 50.25 లక్షల మంది రైతు లకు రూ.5,236 కోట్లు జమ చేయగా.. ఈ ఏడాది వానాకాలం సీజన్లో 1.52 కోట్ల ఎకరాలకు చెందిన 68.99 లక్షల మంది రైతులకు రూ.7,625 కోట్లు అందజేశారు. మొత్తంగా ఈ ఏడాది వానాకాలం సీజన్ వరకు మొత్తంగా రైతుబంధు కింద రైతు లకు రూ.72,815 కోట్లు జమ చేశారు.
90 శాతానికిపైగా ఐదెకరాల్లోపు వారే..
ఈ ఏడాది వానాకాలం సీజన్ లెక్కల ప్రకారం చూస్తే.. రైతుబంధు సొమ్ము తీసుకున్న రైతులు 68.99 లక్షల మందికాగా.. అందులో అత్యధికంగా ఎకరాలోపే భూమి ఉన్న రైతులే 22.55 లక్షల మంది ఉన్నారు. వీరి చేతిలో ఉన్న భూమి 12.85 లక్షల ఎకరాలు మాత్రమే.
ఎకరా నుంచి రెండెకరాల వరకు భూమి రైతుల సంఖ్య 16.98 లక్షలు కాగా.. వీరి చేతిలో ఉన్న మొత్తం భూమి 25.57 లక్షల ఎకరాలు.
రెండు నుంచి మూడెకరాల వరకు ఉన్న రైతులు 10.89 లక్షలు. భూమి 26.50 లక్షల ఎకరాలు.
ఇక మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు ఉన్న 6.64 లక్షల మంది రైతుల చేతిలో 22.62 లక్షల ఎకరాలు ఉన్నాయి.
నాలుగు నుంచి ఐదెకరాల భూమి ఉన్న 5.26 లక్షల మంది చేతిలో 21.04 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి.
మొత్తంగా ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.34 లక్షలు కాగా.. వీరందరికీ కలిపి సుమారు కోటి ఎకరాల భూమి ఉంది. అంటే మొత్తం రైతుల్లో 90 శాతానికిపైగా ఐదెకరాలలోపే.
ఐదెకరాలకు పైబడి భూమి ఉన్న రైతుల సంఖ్య కేవలం 6.65 లక్షలే.. కానీ వారి భూమి ఏకంగా 52 లక్షల ఎకరాలు. ఈ క్రమంలో ఐదెకరాల పరిమితి విధిస్తే అవసరమైన రైతులకు పథకాన్ని వర్తింపచేసినట్టు అవుతుందని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు.