హైదరాబాద్ (జూలై – 24) : భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) జులై 30న PSLV-C56 తో 7 ఉపగ్రహాలను ప్రయోగించనున్నది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి సింగపూర్కు చెందిన DS – SAR ఉపగ్రహంతో పాటు మరో ఆరు శాటిలైట్లను నింగిలోకి మోసుకెళ్లనున్నది.
ఈ నెల 30న ఉదయం 6.30 గంటలకు శ్రీహరికోటలోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి డీఎస్ఎల్వీ -ఎస్ ఏఆర్ ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ-సీ56 ద్వారా ప్రయోగించనున్నారు.
డీఎస్-ఎస్ఏఆర్ ఉపగ్రహం బరువు 360 కిలోలు. సింగపూర్కు చెందిన డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ (DSTA), ఎస్టీ ఇంజినీరింగ్ భాగస్వామ్యంతో ఉపగ్రహాన్ని అభివృద్ధి చేసింది. ఈ ఉపగ్రహం పగలు-రాత్రి కవరేజీని అందివ్వనున్నది. ఇది పూర్తి పోలారిమెట్రీ వద్ద 1 మీ. రిజల్యూషన్ వద్ద ఇమేజింగ్ చేయగలదు. సింగపూర్ ప్రభుత్వంలోని వివిధ ఏజెన్సీలకు సేవలందించనున్నది.