శ్రీహరి కోట (ఎప్రిల్ – 22) : భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన తిరుపతి జిల్లాలోని షార్ నుంచి ఈరోజు మధ్యాహ్నం 2.20 గంటలకు పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV C55) ప్రయోగం చేపట్టేందుకు ఇస్రో ఏర్పాట్లు పూర్తి చేసింది.
సింగపూర్ కు చెందిన 741 కిలోల బరువుగల టెలీయోస్-2, 16 కిలోల లూమోలైట్-4 ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ మోసుకెళ్లనుంది.
టెలీయోస్-2 ఉపగ్రహం సింగపూర్ ప్రభుత్వానికి చెందినది. ఎస్టీ ఇంజినీరింగ్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు. ఉపగ్రహంలో సింథటిక్ ఎపర్చరు రాడార్ పేలోడ్ ను ఉంచారు. అన్ని వాతావరణ పరిస్థితుల్లో కవరేజీ అందించగలదు.
లూమాలైట్ 4 ఉపగ్రహాన్ని ఇన్స్టిట్యూట్ ఫర్ ఇన్ఫోకామ్ రీసెర్చ్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ లోని శాటిలైట్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేశారు.