PADMA AWARDS 2024 – చిరంజీవి, వెంకయ్య నాయుడు లకు పద్మ విభూషణ్

BIKKI NEWS (JAN. 25) : వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి కేంద్రం పద్మ అవార్డులు 2024 ను ప్రకటించింది. ఈ ఏడాది పద్మ విభూషణ్ అవార్డుకు 5గురు (Padma Vibhushan 2024 Awards) ఎంపికయ్యారు. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లకు కేంద్రం పద్మవిభూషణ్ సత్కరించింది.

ఈ ఏడాది మొత్తం 132 మందికి పురస్కాలు ప్రకటించగా.. వీటిలో 5 మందికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీలు దక్కాయి.

దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ను బిహార్ జననాయక్, మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ (మరణానంతరం) ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

Padma Vibhushan 2024 Awards

1) వైజయంతి మాల బాలి (కళారంగం)- తమిళనాడు
2) కొణిదెల చిరంజీవి (కళారంగం) – ఆంధ్రప్రదేశ్
3) వెంకయ్యనాయుడు ( ప్రజా వ్యవహారాలు) – ఆంధ్రప్రదేశ్
4) బిందేశ్వర్ పాఠక్ ( సామాజిక సేవ)- బిహార్
5) పద్మ సుబ్రమణ్యం ( కళారంగం)- తమిళనాడు

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు