నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ ఫలితాలు విడుదల

హైదరాబాద్ (మే – 20) : నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్(NMMS) కింద డిసెంబర్ – 2022 లో పరీక్ష రాసిన వారిలో తెలంగాణ రాష్ట్రం నుంచి 2,716 మంది ఎంపికయ్యారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే నిర్వహించే ఈ పరీక్ష గత డిసెంబరు 18వ తేదీన జరిగింది. దానికి 31,807 మంది హాజరయ్యారు. ఎంపికైన వారికి 9వ తరగతి నుంచి ఇంటర్ పూర్తయ్యేవరకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఉపకార వేతనం అందుతుందని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు తెలిపారు.

NMMS 2022 DECEMBER CANDIDATES LIST