తెలంగాణలో ఉద్యోగ నియామకాల భర్తీకి రోస్టర్ పాయింట్స్ తీసుకొనే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో 80 వేల పైచిలుకు పోస్టుల భర్తీ నేపథ్యంలో ఇబ్బందులు తలెత్తకుండా రోస్టర్ పాయింట్స్ ఏవిధంగా తీసుకోవాలో స్పష్టంగా పేర్కొన్నారు.
★ కొత్త రోస్టర్ ప్రకారం :-
1) 2018 ఆగస్టు 30 తర్వాత నోటిఫికేషన్ ఇచ్చే పోస్టులకు కొత్త రోస్టర్ పాయింట్స్ 1 నుంచి మొదలు పెట్టాలి.
- విభిన్న దిగువ తరగతి ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ భర్తీ చేసే ఖాళీలకు కూడా కొత్త రోస్టర్ విధానమే.
★ పాత రోస్టర్ ప్రకారం :-
1) 2018 ఆగస్టు 30కు ముందు నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టుల్లో భర్తీ కాకుండా ఉన్న రూల్ ఆఫ్ రిజర్వేషన్ పోస్టులను క్యారీ ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులను పాత రోస్టర్ ప్రకారమే భర్తీ చేయాలి.
2) పదోన్నతుల ద్వారా భర్తీ చేసే పోస్టుల్లో క్యారీఫార్వర్డ్ పోస్టులకు పాత రోస్టర్ విధానమే వర్తిస్తుంది.
Follow Us @