హైదరాబాద్ (ఆగస్టు – 07) : జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశంలోనే తొలిసారిగా “నేతన్న బీమా” పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని సీఎం కేసీఆర్ అన్నారు. దాదాపు 80 వేల మంది నేత కార్మికుల కుటుంబాలకు ఈ బీమా వర్తించడం సంతోషకరమైన విషయమని సీఎం అన్నారు.
దురదృష్టవశాత్తు ఏ నేత కార్మికుడయినా చనిపోతే వారి కుటుంబానికి రూ.5 లక్షలు అందించే ఈ పథకం చేనేత, మరమగ్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని సీఎం పేర్కొన్నారు. ఇది ప్రజా సంక్షేమం పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని సీఎం శ్రీ కేసీఆర్ స్పష్టం చేశారు.
నేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే, సహకరించాల్సిన కేంద్ర ప్రభుత్వం పన్నుల పెంపుతో చేనేత, పవర్ లూం రంగాన్ని కుదేలు చేస్తున్నది. ఎన్ని కష్టాలనైనా తట్టుకుని చేనేత రంగానికి, ఆ రంగంపై ఆధారపడ్డ కుటుంబాలకు అన్నివేళలా బాసటగా నిలుస్తాం అని తెలిపారు.
#Nationa
Follow Us @