టోక్యో పారాలింపిక్స్లో భారత్కు ఐదో బంగారు పతకం లభించింది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్హెచ్ 6లో కృష్ణ నాగర్ గోల్డ్ మెడల్ సాధించాడు. హాంకాంగ్ ప్లేయర్ కైమన్ చూతో జరిగిన ఫైనల్లో 21-17, 16-21, 21-17తో విజయం సాధించాడు. దీంతో బ్యాడ్మింటన్లో బంగారు పతకం సాధించిన రెండో ప్లేయర్గా రికార్డు సాధించాడు.
అలాగే బ్యాడ్మింటన్లో సుహాస్ యతిరాజ్ సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నాడు.