KU : కాంట్రాక్టు అధ్యాపకులకు ఎక్స్‌గ్రేషియా

హన్మకొండ (డిసెంబర్ – 19) : కాకతీయ యూనివర్సిటీ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు అనుకోని ఘటనలు జరిగినప్పుడు మరియు రిటైర్మెంట్ సమయంలో 15 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసినట్లయితే 3.75లక్షలు, 20 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి రిటైర్ అయినట్లయితే 5 లక్షల రూపాయలు కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఎక్స్‌గ్రేషియా గా ఇవ్వడం జరుగుతుందని కాకతీయ యూనివర్సిటీ పాలకమండలి నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.

ఈ నేపథ్యంలో ఇందుకు సహకరించిన యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ టీ. రమేష్, టీచర్ ఎమ్మెల్సీ అయిన అలుగుబెల్లి నర్సిరెడ్డిలకు తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం. రామేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీధర్ కుమార్ లోధ్ లు కృతజ్ఞతలు తెలియజేశారు.