ISRO : భారత్ కు సొంత అంతరిక్ష కేంద్రం

హైదరాబాద్ (అక్టోబర్ – 06) : భారతదేశం త్వరలోనే అంతరిక్ష పరిశోధన ప్రాజెక్టు ను (india space station) సొంతంగా ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు చేపడుతుందని ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ వెల్లడించారు.

ఇందులోళభాగంగా అంతరిక్ష కేంద్ర నిర్మాణం, దీర్ఘకాల మానవ అంతరిక్ష యానంతో పాటు భవిష్యత్తు మిషన్ల కోసం వివిధ అవకాశాలను అన్వేషిస్తోందని తెలిపారు. అంతరిక్ష కేంద్రం ఏర్పాటు భారతీయ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థకు ఎలా ప్రయోజనకరంగా ఉంటుందనే విషయం పరిశీలిస్తున్నామన్నారు.

సమీప భవిష్యత్తులో సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి, రోబోటిక్ .ఆపరేషన్ ప్రారంభించాలని ప్రణాళిక రూపొందించుకున్నట్లు వివరించారు.

ప్రస్తుతానికి మానవ సహిత అంతరిక్ష యానంపై దృష్టి సారించామన్నారు. గగన్ యాన్ కార్యక్రమం అదే దిశగా సాగుతోందని చెప్పారు. అది నెరవేరితే, ఆ తర్వాత వచ్చే 20-25 ఏళ్లలో చేపట్టే మిషన్లలో స్పేస్ స్టేషన్ ఏర్పాటు ఉంటుందన్నారు. తద్వారా ఇప్పటికే ఈ దిశగా విజయం సాధించిన అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ చేరుతుందన్నారు.