ఆహ్మదాబాద్ (మే – 26) : ఐపీఎల్ 2023 క్వాలిఫైయర్ – 2 లో గుజరాత్ టైటాన్స్ జట్టు ముంబై ఇండియన్స్ పై ఘనవిజయం సాధించి వరుసగా రెండోసారి ఫైనల్ కు చేరింది. ఫైనల్ లో చెన్నై జట్టు తో గుజరాత్ (ipl2023final) తలపడనుంది.
మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఓపెనర్ శుభమన్ గిల్ సూపర్ సెంచరీ (129) తో చెలరేగడంతో 233/3 భారీ స్కోరు చేసింది. ఈ ఐపిఎల్ లో ఇది గిల్ కి మూడవ సెంచరీ కావడం విశేషం.
అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ముంబై ఇండియన్స్ జట్టు తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ లు ఉన్నంతసేపు లక్ష్యం చేదించేలా కనపడింది. సూర్య ఔట్ అయ్యాక వరుసగా వికెట్లు కోల్పోయి ఐపీఎల్ లో తన పోరాటం ముగించింది.
ఒక ఐపిఎల్ సీజన్ లో అత్యధిక సెంచరీల చేసిన బ్యాట్స్ మెన్ గా కోహ్లీ, బట్లర్ పేరిట రికార్డు ఉంది. కోహ్లీ, బట్లర్ లు ఓకే ఐపీఎల్ సీజన్ లో 4 సెంచరీలు చేశారు..
ఓకే సీజన్ లో 800 కు పైగా పరుగులు సాధించిన రెండో భారత బ్యాట్స్ మెన్ గా శుభమన్ గిల్ (859) నిలిచాడు. మొదటి బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ ఉన్నాడు.
ఐపీఎల్ ఫైనల్ 2023 లో చెన్నై సూపర్ కింగ్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది.
- ST STUDY CIRCLE : బ్యాంకింగ్, SSC ఉద్యోగాలకై ఉచిత కోచింగ్
- INTER RESULTS : రీకౌంటింగ్, రీ వెరిఫికెషన్ ఫలితాలు కోసం క్లిక్ చేయండి
- Environmental Days : పర్యావరణ సంబంధిత దినోత్సవాలు
- SIVE : పటాపట్ నౌకరీ కోసం షార్ట్ టెర్మ్ వొకేషనల్ కోర్సులలో దరఖాస్తులు ఆహ్వానం
- బీసీ ఇంటర్ గురుకులాల్లో జూన్ 10 లోగా కళాశాలలో చేరాలి