INTER EXAMS – 8వ రోజు రిపోర్ట్ – 19 మంది డిబార్

BIKKI NEWS (MAR. 15) : INTER EXAMS 2025 8th DAY REPORT. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ 2025 ఎనిమిదో రోజు ద్వితీయ సంవత్సరం మ్యాథమెటిక్స్ – 2B, జువాలజీ – 2, హిస్టరీ – 2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 19 మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు అయ్యాయి.

INTER EXAMS 2025 8th DAY REPORT

నిజామాబాద్ జిల్లాలో – 9, సంగారెడ్డి జిల్లా లో – 4, సిద్దిపేట జిల్లాలో – 2, మేడ్చల్ జిల్లా లో – 2, పెద్దపల్లి జిల్లాలో – 1, మహబూబాబాద్ జిల్లాలో – 1 చొప్పున మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు అయ్యాయి.

8వ రోజు పరీక్షలకు 3,76,756 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 3,68,619 మంది హజరయ్యారు. 8,137 మంది గైర్హాజరయ్యారు.

బోర్డు నుంచి పరీశీలకులు మహబూబాబాద్, సంగారెడ్డి, జనగాం, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో పర్యటించి పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు రిపోర్ట్ చేసినట్లు బోర్డు ప్రకటించింది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు