BIKKI NEWS (JAN. 03) : INDURI SHIVAREDDY DONATES FOR MID DAY MEALS TO GJC SANGEM. సంగెం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నిధుల కొరతను తీర్చడానికి కుంటపల్లి గ్రామ వాస్తవ్యులు శ్రీ ఇందూరి శివారెడ్డి – రాణి దంపతులు ముందుకొచ్చారు. వారు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం రూ.8,000/- విరాళంగా అందించారు. విద్యార్థులకు వారిచేతుల మీదుగా భోజనం వడ్డించారు.
INDURI SHIVAREDDY DONATES FOR MID DAY MEALS TO GJC SANGEM
ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం విద్యార్థుల ఆరోగ్యం మరియు అభ్యాస సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది అని వారు పేర్కొన్నారు. ఈ దాతృత్వం విద్యార్థులకు చదువుపై మరింత దృష్టి పెట్టేలా ప్రోత్సహిస్తుంది అని ప్రిన్సిపాల్ కాక మాధవరవు గారు పేర్కొన్నారు.
ఇందూరి శివారెడ్డి రాణి దంపతుల దాతృత్వం సమాజ సేవకు మంచి ఉదాహరణ అని వారిని కళాశాల అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందం కొనియాడారు..
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ “కాక మాధవరావు గారు,సీనియర్ అధ్యాపకురాలు విజయనిర్మల, గ్రంధపాలకులు రాజకుమార్ , అధ్యాపకులు బుచ్చిరెడ్డి, నాగరాజు,అనిల్ కుమార్, పవన్ కుమార్, కుమారస్వామి, యాక సాయిలు,రాఖీ, చిరంజీవి, కుమారస్వామి, మాధవి, సుధీర్ కుమార్,, పద్మ, రమాదేవి, సదయ్య, శివ, లక్ష్మి, సంగీత, మరియు విద్యార్తిని, విద్యార్థులు పాల్గొన్నారు
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్