న్యూడిల్లీ (జూలై – 21) : భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. ఎన్డీయే అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పై పోటీ చేసిన ఆమెకు 53శాతానికి పైగా ఓట్లు రావడంతో నూతన రాష్ట్రపతి గా ఎన్నికయ్యారు. జూలై 25న రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
భారతదేశపు మొదటి గిరిజన, రెండో మహిళ రాష్ట్రపతి గా ఆమె నిలువనున్నారు.