భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు శావ్కట్ మిర్జియోయెవ్ డిసెంబర్ 11న వర్చువల్ విధానంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పునరుత్పాదిత ఇంధనం, డిజిటల్, సైబర్ టెక్నాలజీ, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టులు, వస్తు రవాణా, సమాచార మార్పిడి వంటి రంగాల్లో మొత్తం 9 ఒప్పందాలు కుదిరాయి. అలాగే, ఉజ్బెకిస్తాన్లో అభివృద్ధి కోసం 44.8 కోట్ల డాలర్ల రుణాన్ని అందించేందుకు భారత్ అంగీకరించింది.