BIKKI NEWS (MAY 08) : INDIA PAKISTAN WAR STARTED. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైంది. పాకిస్తాన్ 16 వంటి అధునాతన యుద్ధ విమానాన్ని భారత్ పైకి ప్రయోగించింది. అయితే దీన్ని భారత మధ్యలోనే కూల్చివేసింది. దీనిపై పాకిస్తాన్ అధికారిక ప్రకటన చేసింది.
INDIA PAKISTAN WAR STARTED
అలాగే భారత్ పాకిస్తాన్ సరిహద్దు లో తీవ్ర దాడులు ఇరువైపుల నుంచి కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ ప్రయోగిస్తున్న షార్ట్ రేంజ్ క్షిపణులు, డ్రోన్ లను భారత్ విజయవంతంగా తిప్పి కొడుతుంది. ఎఫ్ 16 యుద్ధ విమానాన్ని కూల్చిన తర్వాత పాకిస్థాన్ పైలెట్ ను భారత్ బలగాలు పట్టుకున్నాయి.
భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లోని పంజాబ్, రాజస్థాన్ జమ్మూ అండ్ కాశ్మీర్ లలో పలు పట్టణాలలో కరెంట్ ను బంద్ చేశారు. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇంటర్నెట్ను కూడా బంద్ చేశారు
పాకిస్తాన్ భారత సైనిక స్థావరాల మీద దాడికి పాల్పడుతున్నట్లు భారత రక్షణ శాఖ ప్రకటించింది. ఆ దాడులను విజయవంతంగా తిప్పి కొట్టినట్లు ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని ప్రకటించింది.
జమ్మూ ఎయిర్పోర్ట్ పై పాకిస్తాన్ దాడి చేసింది. అలాగే జమ్మూలోని ఏడు ప్రాంతాలలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు సమాచారం.
త్రివిధ దళాలతో పాకిస్థాన్ పై దాడులు చేయడానికి భారత్ సిద్ధమవుతున్నట్లు సమాచారం వస్తుంది.
పాకిస్తాన్ భారత్ మధ్య మధ్యవర్తిత్వం జరుపుతామని అమెరికా ప్రకటించింది. భారత్ మరియు పాకిస్తాన్ దేశాల మధ్య చర్చలకు మద్దతిస్తామని అమెరికా ప్రకటించింది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్