BIKKI NEWS (MARCH 09) : ICC CHAMPIONS TROPHY 2025 FINAL. ఐసీసీ చాంపియన్ ట్రోఫీ 2025 ఫైనల్ కు దుబాయ్ వేదికగా రంగం సిద్ధమైంది. నేడు భారత్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య (IND VS NZ) మధ్యాహ్నం 1:30 నుండి మ్యాచ్ ప్రారంభం కానుంది.
ICC CHAMPIONS TROPHY 2025 FINAL
గతేడాది ఐసీసీ టి20 వరల్డ్ కప్ నెగ్గిన భారత జట్టుకు మరో ఐసిసి కప్ ఊరిస్తుంది.
ఇప్పటికే రెండుసార్లు ఐసిసి చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన భారత జట్టుకు ఈరోజు జరిగే ఫైనల్ లో గెలిస్తే మూడోసారి విజేత కానుంది.
ఈ టోర్నీలో ఓటమి ఎరుగకుండా ఫైనల్ చేరిన జట్టుగా భారత్ నిలిచింది. లీగ్ దశలో కివీస్ జట్టును భారత్ ఓడించిన సంగతి తెలిసిందే
2000 వ సంవత్సరం లో న్యూజిలాండ్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో భారత్ ను ఓడించి విజేతగా నిలిచింది.
2002లో భారత్ – శ్రీలంక సంయుక్త విజేతగా నిలిచింది. 2013లో భారత్ ఇంగ్లాండ్ ను ఓడించి విజేతగా నిలిచింది. 2017 ఫైనల్ లో పాకిస్తాన్ పై ఓడి రన్నరప్ గా నిలిచింది.
ఐసీసీ నాకౌట్ మ్యాచ్ లలో కివీస్ కు భారత్ పై పూర్తి ఆధిక్యత ఉంది. ఇప్పటివరకు నాలుగు సార్లు తలపడగా 3-1 తో కివీస్ ముందంజలో ఉంది.
- INTER EXAMS – ఆరో రోజు రిపోర్ట్
- AP EAPCET 2025 నోటిఫికేషన్ విడుదల
- CURRENT AFFAIRS 11th MARCH 2025 – కరెంట్ అఫైర్స్
- CURRENT AFFAIRS 10th MARCH 2025 – కరెంట్ అఫైర్స్
- INTER EXAMS QP SET – 12th March 2025