హైదరాబాద్ (ఆగస్టు – 02) : ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఖాళీగా ఉన్న దాదాపు 6432 ప్రొబేషనరీ ఆఫీసర్లు (P.O.) మరియు మేనేజ్మెంట్ ట్రైనీ (M.T.) పోస్టులను భర్తీ చేయడానికి ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS) నోటిఫికేషన్ను విడుదల చేసింది.
మొత్తం పదకొండు బ్యాంకులలో కేవలం ఆరు బ్యాంకులు మాత్రమే ఖాళీలను చూపించాయి.. మిగతా 5 బ్యాంకులు కూడా ఖాళీలను చూపిస్తే పోస్టుల సంఖ్య పది వేలు దాటే అవకాశం ఉంది.
◆ దరఖాస్తు ప్రారంభ తేదీ : 02/08/2022
◆ దరఖాస్తు ముగింపు తేదీ : 22/08/2022
◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్
◆ పరీక్ష విధానం : ఆన్లైన్ టెస్ట్
◆ అర్హతలు : బ్యాచిలర్ డిగ్రీ
◆ వయోపరిమితి : 20 నుంచి 30 ఏళ్ల మద్య వయస్సు కలిగి ఉండాలి. (SC, ST, ఎక్స్ సర్వీస్ మాన్ లకు 5 సం. లు, బీసీలకు 3 సం.లు, PHC – 10 సం. ల మినహాయింపు కలదు) (ఆగస్టు -01 – 2022 నాటికి)
◆ ఎంపిక విధానం : ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా
- ప్రిలిమ్స్ 100 మార్కులకు,
- మెయిన్స్ 200 మార్కులకు
- ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 మార్కులకు ఉంటుంది.
◆ ప్రిలిమ్స్ పరీక్ష తేదీ : అక్టోబర్ – 2022
◆ మెయిన్స్ పరీక్ష తేదీ : నవంబర్ – 2022
◆ ఇంటర్వ్యూ : జనవరి/ఫిబ్రవరి – 2022
◆ వెబ్సైట్ : https://www.ibps.in/crp-po-mt-xii/
◆ పూర్తి నోటిఫికేషన్ : download pdf