◆ దినోత్సవం :
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం
- ప్రపంచ ఆస్తమా దినోత్సవం.
◆ సంఘటనలు :
- 1494: క్రిస్టఫర్ కొలంబస్ జమైకాను కనుగొన్నాడు. దానికి ‘ఇయాగొ’ అని పేరు పెట్టాడు.
- 1791: ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ మే 3 (ఐరోపాలో మొట్టమొదటి ఆధునిక రాజ్యాంగం) –పోలిష్-లిథూనియన్ కామన్వెల్త్ ‘సెజ్మ్’ ప్రకటించింది. (20వ శతాబ్దానికి ముందు పోలిష్ పార్లమెంట్ లోని దిగువ సభ (మన లోక సభ వంటిది), ఎగువ సభ (మన రాజ్య సభ వంటిది), వారి రాజు, ఈ మూడింటిని కలిపి ‘సెజ్మ్” అనేవారు).
- 1802: వాషింగ్టన్ డి.సి. ని, ఒక నగరంగా గుర్తించారు.
- 1830: ప్రతీరోజూ ప్రయాణీకులను తీసుకువెళ్ళటానికి, ఆవిరితో నడిచే రైలు (పొగబండి) సేవలు, మొదటిసారిగా మొదలయ్యాయి.
- 1837: యూనివర్సిటీ ఆఫ్ ఏథెన్స్ స్థాపించారు.
- 1841: న్యూజిలాండ్దేశం బ్రిటిష్ కోలనీగా మారింది.
- 1855: ఏంట్వెర్ప్ – రోటర్డాం రైలు మార్గం మొదలయింది.
- 1906: సినాయ్ ద్వీపకల్పం బ్రిటిష్ ఆధీనంలో ఉన్న ఈజిప్ట్ సరిహద్దుగా ఏర్పడింది. సినాయ్ని టర్కీ నుంచి ఈజిప్ట్ తీసుకుంది.
- 1913: భారతదేశ సినీ చరిత్రలో మొదటి చలనచిత్రం రాజా హరిశ్చంద్ర విడుదల.
- 1939: నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించాడు.
- 1968: యునైటెడ్ కింగడమ్ దేశంలోని లండన్లో మొదటి గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేసారు. ఆ దేశంలో ఇదే మొదటి గుండె మార్పిడి శస్త్ర చికిత్స.
- 1969: భారత రాష్ట్రపతిగా వి.వి.గిరి పదవిని చేపట్టాడు.
- 1973: చికాగో లోని ‘సియర్స్ టవర్’ ప్రపంచంలోని ఎత్తైన భవంతిగా గుర్తింపు పొందింది.
- 1978: ‘సూర్య దినం’ – ‘సౌర శక్తి’ కి సంబంధించిన విశేషాలు అమెరికాలో తిలియ చేసారు.
- 1986: శ్రీలంకలో బాంబు పేలుడు వలన 21మంది మరణించారు.
- 2002: భారత వాయుసేనకు చెందిన మిగ్-21 విమానం, జలంధర్ లోని, బాంక్ ఆఫ్ రాజస్థాన్ దగ్గర కూలిపోయి, ఏడుగురు బాంక్ ఉద్యోగులు, 1 కూలీ మరణించగా, 17మంది గాయ పడ్డారు. పైలట్ ఫ్లైట్ లెఫ్ట్నెంట్ ఎస్.కె. నాయక్ క్షేమంగా తప్పించుకున్నాడు.
- 2005: ఇరాక్ చరిత్రలో మొట్టమొదటి సారిగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి, అధికారం చేపట్టింది.
◆ జననాలు :
- 612: కాన్స్టేన్టైన్-III, బైజాన్టైన్ చక్రవర్తి (మ. 641)
- 1892: జార్జ్ పేజెట్ థామ్సన్, ఇంగ్లీషు భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ. 1975). భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీతల పట్టిక
- 1932: బూదరాజు రాధాకృష్ణ, ప్రసిద్ధ భాషావేత్త. (మ.2006)
- 1950: మణివణ్ణణ్, భారత సినిమా నటుడు.
- 1959: ఉమా భారతి, కాషాయధారిణి, భారతదేశపు రాజకీయవేత్త.
- 1970: పద్మావతి. ఎల్, వీరికి రంగస్థలనటిగా 16 సంవత్పరాల అనుభవం ఉంది. చాలా సాంఘిక నాటిక/నాటకల్లో ప్రధాన స్త్రీ పాత్రలను పొషించారు.
◆ మరణాలు :
- 1616: షేక్స్పియర్, ఆంగ్ల నాటక కర్త, నటుడు (జ.1564). (జూలియన్ కేలండర్ ప్రకారం, ఇతడి మరణం, 23 ఏప్రిల్ గా, జనామోదం పొందింది)
- 1969: జాకీర్ హుస్సేన్, పూర్వ భారత రాష్ట్రపతి. (జ.1897)
- 1981: నర్గీస్ భారత సినిమా నటి (జ. 1929)
- 2006: ప్రమోద్ మహాజన్, భారత రాజకీయవేత్త. (జ. 1949)