ఎప్రిల్ 21 చరిత్రలో ఈరోజు

◆ దినోత్సవం :-

  • జాతీయ పౌర సేవల దినోత్సవం

◆ సంఘటనలు :-

  • 1944: ఫ్రాన్సులో మహిళలు వోటు వేయడానికి అర్హత పొందారు
  • 1994: సౌర మండలం బయట ఇతర గ్రహాలను కనుగొన్నట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు
  • 1997: భారత ప్రధానమంత్రిగా ఐ.కె.గుజ్రాల్ నియమితుడైనాడు.

◆ జననాలు :-

  • 1939: భాను ప్రకాష్, తెలుగునాట నాటక వికాసానికి దోహదం చేసిన కళాకారుడు, చలనచిత్ర నటుడు. (మ.2009)
  • 1977: బండ రవిపాల్ రెడ్డి, ప్రముఖ విద్యావేత్త, వేద గణిత నిపుణులు, పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే విద్యార్థులకు శిక్షణ ఇచ్చి, ఎంతో మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చిన గురువు. ప్రకృతిని ఆరాధిస్తూ ఎన్నో మొక్కలను నాటి, తన విద్యార్థులచే నాటించిన మహనీయుడు.

◆ మరణాలు :-

  • 1910: మార్క్ ట్వేయిన్, అమెరికన్ రచయిత, మానవతావాది. (జ.1835)
  • 1938: ముహమ్మద్ ఇక్బాల్, ఉర్దూ, పారశీ భాషలలో కవి. (జ.1877).
  • 2000: నిగార్ సుల్తానా, భారతీయ సినిమా నటి. (జ.1932)
  • 2013: శకుంతలా దేవి, గణిత, ఖగోళ, జ్యోతిష్య శాస్త్రవేత్త. (జ.1929)
  • 2013: అంబటి బ్రాహ్మణయ్య, రాజకీయవేత్త. (జ.1940)
Follow Us @