హరప్పా, మొహంజోదారో నాగరికత విశేషాలు

BIKKI NEWS : భూమి మీద అతి పురాతన నాగరికతలు 1921 నాటి పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాలలో భారత ఉపఖండంలో రావి, సింధూ నది పరివాహకాలలో హరప్పా, మొహంజోదారో నాగరికతలు (harappa-and-mohenjodaro-civilizations-important-facts) బయల్పడ్డాయి…

అక్కడ లభించిన వస్తువులను బట్టి అప్పట్లోనే పట్టణ నాగరికత ఎంతో అబివృద్ది చెందినదని చెప్పవచ్చు. అప్పటి ముఖ్య పట్టణాల గురించి తెలుసుకుందాం…

★ హరప్పా :- (1921)
శాస్త్రవేత్త : దయారాం సహానీ
రాష్ట్రం : పంజాబ్ (పాకిస్థాన్)
నది : రావి నది
విశేషాలు :

  • ధాన్యాగారాలు,
  • శవపేటిక,
  • కాంస్యంతో చేసిన ఎడ్లబండ్లు,
  • ‘H’ ఆకారం శ్మశాన వాటిక.

★ మొహంజోదారో :- (1922)
శాస్త్రవేత్త : ఆర్.డి. బెనర్జీ
రాష్ట్రం : సింధ్ (పాకిస్తాన్)
నది : సింధు నది
విశేషాలు :

  • మహాధాన్యాగారం,
  • మహా స్నానవాటిక,
  • మెసపటోమియాకు చెందిన మూడు స్థూపాకార ముద్రికలు,
  • కాంస్య నాట్యగత్తె విగ్రహం,
  • స్టీటైట్ తో తయారుచేసిన గడ్డపు మనిషి

★ చన్హుదారో :- (1931)
శాస్త్రవేత్త : ఎం.జి. మజుందార్
నది : సింధు నది.
రాష్ట్రం : సింధ్ (పాకిస్తాన్)
విశేషాలు :

  • కోట లేని ఏకైక నగరం,
  • గవ్వలు, పూసలతో ఆభరణాలు తయారయ్యే పరిశ్రమలు,
  • పిల్లికి సంబంధించిన ఆధారాలు.

★ లోథాల్ :- (1955 )
శాస్త్రవేత్త : ఎస్.ఆర్. రావు
నది : భోగావో
రాష్ట్రం : గుజరాత్
ముఖ్య విశేషాలు
::

  • రేవు పట్టణం,
  • నౌకా నిర్మాణ కేంద్రం,
  • ఒకే సమాధిలో జంట శవాలు,
  • వరి గింజ,
  • టెర్రా కోట గుర్రపు బొమ్మ

★ కాళీ బంగన్ :- (1961)
శాస్ర్తవేత్తలు : బి.బి. లాల్, బి.కె, థాపర్
రాష్ట్రం : రాజస్థాన్
నది : ఘగ్గర్ (సరస్వతి)
ముఖ్య విశేషాలు ::

  • ఒక వరుసలో ఏడు హోమగుండాలు,
  • నాగలి గుర్తులున్న వ్యవసాయ భూమి,
  • సర్పిలాకార బొమ్మల లిపి.

★ ధోలవీర :- (1991)
శాస్ర్తవేత్తలు : జె.పి. జోషి ఆర్.ఎస్. బిస్త్
రాష్ట్రం : గుజరాత్
నది : నది లేదు
ముఖ్య విశేషాలు ::

  • స్టేడియం,
  • రిజర్వాయర్,
  • భారతదేశంలో ఉన్న సింధు నగరాల్లో అత్యంత విశాలమైంది.