BIKKI NEWS (MARCH 13) : Half day schools from March 15th. తెలంగాణ రాష్ట్రంలో మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది
Half day schools from March 15
ఎండలు కారణంగా విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఒక్క పూట బడులను నిర్వహించే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి 15 నుంచి తెలంగాణ రాష్ట్రం లో పాఠశాలలకు ఒక్క పూట బడులను నిర్వహించాలని ఆదేశించారు.
ఉదయం 8.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు బడులను నిర్వహిస్తారు. పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం 1.00 నుంచి 5.00 గంటల వరకు బడులను నిర్వహిస్తారు.