హైదరాబాద్ (సెప్టెంబర్ – 02) : రెండు మూడు రోజుల్లో గ్రూప్ 4 నోటిఫికేషన్ వస్తుందని. రాబోయే వారం రోజుల్లో 28 వేల ఉద్యోగాల భర్తీకి నియామక ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రి హరీశ్ రావు గారు చెప్పారు.
◆ 40 లక్షల మందికి పెన్షన్ :
సంగారెడ్డి పట్టణంలో కొత్త పింఛనుదారులకు మంత్రి హరీశ్ రావు గారు స్మార్టు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.2016 పెన్షన్ ఇస్తున్నామన్నారు. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం రూ.600 మాత్రమే పింఛన్ ఇస్తున్నదని విమర్శించారు.
రాష్ట్రంలో మొత్తం 40 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు పింఛన్లు అదిస్తున్నామని చెప్పారు. ఎవరూలేని వారికి పింఛను, బియ్యం భరోసా ఇస్తున్నాయని వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా వివిధ వర్గాల వారికి పింఛన్లు ఇచ్చి గౌరవం ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు అండగా ఉంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ల కోసం రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని చెప్పారు.
◆ ఇంటి నిర్మాణానికి మూడు లక్షలు :
పేద ప్రజల కోసం సీఎం కేసీఆర్ గారు పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి అమలు చేస్తున్నారని వెల్లడించారు. సొంత జాగాలో ఇండ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం రూ.3 లక్షలు ఇచ్చే కార్యక్రమాన్ని దసరా పండుగకు ప్రారంభిస్తామన్నారు.
Follow Us @