Home > UNCATEGORY > ఇంటర్ లో ఉత్తమ ఫలితాలు సాదించిన జీజేసీ మెట్‌పల్లి

ఇంటర్ లో ఉత్తమ ఫలితాలు సాదించిన జీజేసీ మెట్‌పల్లి

BIKKI NEWS (APR. 24) : GJC METPALLY GOT GOOD RESULT IPE 2025. జగిత్యాల జిల్లా, మెట్ పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాలలో తమ ప్రతిభను చాటారు. అత్యుత్తమ మార్కులు సాధించి కళాశాలకు మరియు తమ గ్రామాలకు, తమ కుటుంబాలకు మంచి పేరును తెచ్చారు.

GJC METPALLY GOT GOOD RESULT IPE 2025

ముఖ్యంగా ఫస్టియర్ MPC గ్రూప్ లో డీ. లహరి (456/470), కే. .శ్రీజ (455/470), పీ. హర్షిణి (442/470), జీ. శ్రీనిధి (441/470), ఐ. నవీన (441/470) మార్కులతో తమ సత్తా చాటారు.

అలాగే హెచ్ఈసీ సెకండీయర్ లో కె. గాయత్రి (964/1000) మార్కులు సాధించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. వేంకటేశ్వర రావు గారు విద్యార్థులను అభినందించారు. తమ కళాశాలలో ఉత్తమ బోధన అందించే ఎంతో అనుభవం ఉన్న అధ్యాపకులు, మంచి బోధనకు అవకాశం ఉన్న వాతావరణం, విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కావున పదో తరగతి పూర్తయిన విద్యార్థులు తమ కళాశాలలో అడ్మిషన్ పొంది ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు