జూలై 10 వరకు ఎంసెట్‌, జేఈఈ, నీట్‌ లకు ఉచిత శిక్షణ – ఇంటర్ బోర్డు

ఎంసెట్‌, జేఈఈ, నీట్‌ తదితర పోటీ పరీక్షలకు టీశాట్‌ ద్వారా గురువారం నుంచి ఉచిత శిక్షణ ఇవ్వాలని ఇంటర్‌విద్య కమిషనరేట్‌ అధికారులు నిర్ణయించారు. జూలై 10 వరకు ప్రతిరోజూ సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ప్రసారాలు కొనసాగుతాయి. గణితం, ఫిజిక్స్​​‍, కెమిస్ట్రీ, జీవశాస్త్రం సబ్జెక్టుల్లో నిపుణులైన ఇంటర్‌ అధ్యాపకులచే రికార్డు చేసిన పాఠ్యాంశాలను ప్రసారం చేస్తారు. ఈ డిజిటల్‌ పాఠ్యాంశాలను ‘డిపార్ట్ మెంట్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఈ లర్నింగ్‌ తెలంగాణ’ యూట్యూబ్‌ చానల్‌లోనూ అందుబాటులో ఉంచుతామని తెలిపారు.

జేఈఈ మెయిన్‌-2, నీట్‌, ఎంసెట్‌ పరీక్షలు జూలైలో నిర్వహించనున్నారు. ఇప్పటికే ఇంటర్‌ బోర్డు అందజేస్తున్న ఉచిత ఆన్‌లైన్‌ కోచింగ్‌ అవకాశాన్ని 12 వేల మంది విద్యార్థులు వినియోగించుకొంటున్నారని అధికారులు తెలిపారు. పోటీ పరీక్షలు ముగిసేలోగా మొత్తం నాలుగు గ్రాండ్‌ టెస్టులను నిర్వహిస్తామని వెల్లడించారు.

Follow Us @