FORBES – శక్తివంతమైన మహిళల్లో 6 గురు భారతీయులు

న్యూయార్క్(డిసెంబర్) : అమెరికా బిజినెస్ మేగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసిన ‘ప్రపంచంలో 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల’ వార్షిక జాబితాలో ఆరుగురు భారతీయులకు (forbes-100-powerful-women-2022-list) స్థానం దక్కింది. మొదటి స్థానంలో యూరోపియన్ కమీషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్ లియోన్ నిలిచారు. రెండో స్థానంలో క్రిస్టినా లాగర్డే, మూడో స్థానంలో కమలా హరీష్ నిలిచారు.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(36) భారత్ లో శక్తివంతమైన మహిళలగా నిలిచారు.

మిగతా భారతీయులలో హెచ్ సీఎల్ చైర్పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రా (ర్యాంకు 53), సెబీ చైర్పర్సన్ మాధవీ పూరి (ర్యాంకు 54), స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ సోమా మోండాల్ (ర్యాంకు 67) బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా(ర్యాంకు 72), నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణీ నాయర్ (ర్యాంకు 89) ఈ జాబితాలో చోటు సాధించారు.