దేశంలో తొలి గోల్డ్ ఏటీఎం హైదరాబాద్ లో ప్రారంభం

హైదరాబాద్ (డిసెంబర్ – 04) : బారత్ లో తొలి గోల్డ్ ఏటీఎంను డిసెంబర్ 3న హైదరాబాద్ బేగంపేటలోని గోల్డ్ సిక్కా సంస్థ కార్యాలయంలో తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ప్రారంభించారు.

డెబిట్, క్రెడిట్ కార్డులతో కావాల్సిన బంగారాన్ని ఇందులో డ్రా చేసుకోవచ్చు. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి గోల్డ్ ఏటీఎం ఒక ఉదాహరణని ఆమె అభివర్ణించారు.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

ఈ ఏటీఎం ద్వారా 99.99శాతం శుద్ధత కలిగిన 0.5, 1, 2, 5, 10, 20, 50, 100 గ్రాముల బంగారు నాణేలు డ్రా చేసుకోవచ్చని గోల్డ్ సిక్కా సంస్థ సీఈవో సయ్యద్ తరుజ్ తెలిపారు. బంగారు నాణేలతో పాటు వాటి నాణ్యత, గ్యారంటీ తెలిపే పత్రాలూ జారీ అవుతాయని వెల్లడించారు. త్వరలో నగరంలోని గుల్జార్ హౌస్, సికింద్రాబాద్, అబిడ్స్ పాటు పెద్దపల్లి, వరంగల్, కరీంనగర్ లలో గోల్డ్ ఏటీఎంలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. బంగారం ధరలు ఎప్పటికప్పుడు ఏటీఎం స్క్రీన్ పై కనిపిస్తాయని వెల్లడించారు.

Follow Us @