BIKKI NEWS (జనవరి 24) : Exam pads distribution to GJC Sangem students. పసునూటి ఆనంద్, బొజ్జ సురేష్, ఉండిలా మల్లికార్జున్, పడాల శ్రీకాంత్ లు సంగెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులందరికి 6 వేల రూపాయల విలువ చేసే పరీక్ష ప్యాడ్స్ను విరాళంగా ఇచ్చారు.
Exam pads distribution to GJC Sangem students
సంగెం కళాశాల విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పబ్లిక్ ఎగ్జామ్స్ లో మంచి ఫలితాలు సాధించాలని, విద్యార్థులు సంగెం కళాశాలకు మంచి పేరు తీసుకు రావాలని ఎగ్జామ్స్ ప్యాడ్స్ ని విరాళంగా ఇచ్చారని ప్రిన్సిపాల్ శ్రీ కాక మాధవ రావు పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయులు పసునూటి ఆనంద్ 2024-25 అకాడమీక్ సంవత్సరానికి పబ్లిక్ ఎగ్జామ్స్ లో కళాశాల కి టాపర్ గా వచ్చిన విద్యార్థులకు మొదటి బహుమతి 2,116/- ద్వితీయ బహుమతి 1,116/- గా ప్రకటించారు.
ఈ ప్యాడ్స్తో విద్యార్థులు తమ పరీక్షలకు మరింత సిద్ధంగా ఉండగలుగుతారు. విద్యార్థులు ఈ విరాళాన్ని ఆనందంతో స్వీకరించారని దాతలను కళాశాల బృందం కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కాక మాధవరావు సీనియర్ అధ్యాపకురాలు విజయనిర్మల, గ్రంధపాలకులు రాజ్ కుమార్, సుధీర్ కుమార్, అధ్యాపకులు మామిండ్ల బుచ్చిరెడ్డి, నాగరాజు, అనిల్ కుమార్, కుమారస్వామి, యాకసాయిలు, రాఖీ, మాధవి, పద్మ, రమాదేవి, సదయ్య,లక్ష్మి, సంగీత, మరియు విద్యార్తిని విద్యార్థులు పాల్గొన్నారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్