హైదరాబాద్ (డిసెంబర్ – 11) : ఇటీవల జరిగిన తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సమావేశంలో ఇంగ్లీష్ సబ్జెక్టు (English practical exams) కు కూడా ప్రాక్టికల్స్ అమలుపై నిర్ణయం తీసుకున్నారు. వచ్చే విద్యాసంవత్సరం (2023 – 24) వార్షిక పరీక్షల్లో ఇంగ్లిష్ పరీక్షను 80 మార్కులు థియరీ, 20 మార్కులు ప్రాక్టికల్స్ కు కేటాయిస్తారు.
వార్షిక పరీక్షలే కాకుండా ఇంటర్నల్ ఎగ్జామ్స్ లో కూడా ఇదే విధానంలోనే నిర్వహించనున్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు సెకండియర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులకే ప్రాక్టికల్స్ ఉండగా, వచ్చే విద్యాసం వత్సరం నుంచి ఇంగ్లిష్ లోనూ ప్రాక్టికల్స్ ఉండనున్నాయి.