right to education act – ప్రైవేట్ విద్యా సంస్థలలో 25% అడ్మిషన్స్

విజయవాడ (మార్చి – 05) : ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం ( right to education act) కింద ప్రైవేటు విద్యా సంస్థల్లో 25 శాతం ప్రవేశాలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ మార్చి 4న నోటిఫికేషన్ జారీ చేశారు.

ప్రైవేటు పాఠశాలలు మార్చి 6 నుంచి 16 వరకు ఆన్లైన్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకోవాలని, విద్యార్థులు మార్చి 18 నుంచి ఏప్రిల్ 7వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ప్రవేశాలకు అర్హత పొందిన విద్యార్థుల ఎంపిక ప్రక్రియ ఏప్రిల్ 9 నుంచి 12 వరకు జరుగుతుందని, మొదటి జాబితాను 13న విడుదల చేస్తామని వెల్లడించారు.

◆ వెబ్సైట్ : https://cse.ap.gov.in/