బీ పార్మసీ చివరి విడత కౌన్సెలింగ్

హైదరాబాద్ (సెప్టెంబర్ 19) : తెలంగాణ ఎంసెట్ 2023 బైపీసీ విద్యార్థులు బీ – ఫార్మసీ, ఫార్మా – డి తదితర కోర్సుల్లో చేరేందుకు చివరి విడత కౌన్సెలింగ్ సెప్టెంబరు 17న ప్రారంభమైంది. ఈ విడతలో 4,048 సీట్లు విద్యార్థులకు అందుబాటులో కలవు.

తొలివిడత కౌన్సెలింగ్ కన్వీనర్ కోటాలో రెండు కోర్సుల్లో కలిపి 9,362 సీట్లు అందుబాటులో ఉండగా.. వాటిలో 9,168 భర్తీ అయ్యాయి. 194 సీట్లు మిగిలి పోయాయి. అయితే సీట్లు పొందిన వారు రిపోర్టింగ్ చేయకపోవడంతో పాటు కాకతీయ వర్సిటీ, జేఎన్టీయూహెచ్ మరికొన్ని కళాశాలల్లో సీట్లకు అనుమతి ఇచ్చింది. ఫలితంగా చివరి విడతకు బీ ఫార్మసీలో 3,523, ఫార్మా డి కోర్సులో 525 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

చివరి విడత కౌన్సెలింగ్ లో భాగంగా సెప్టెంబరు 19న ధ్రువ పత్రాలు పరిశీలిస్తారు. సెప్టెంబరు 20వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. సెప్టెంబరు 23 లోపు సీట్లు కేటాయిస్తారు.