సిరిసిల్ల (సెప్టెంబర్ – 22) : ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో డిజిటల్ ట్యాబ్ లను మంత్రి కేటీఆర్ ప్రభుత్వం జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు అందజేశారు.
జిల్లాలో మొత్తం 6000 మంది ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ట్యాబ్ లు అందజేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టగా, నేడు 850 మంది విద్యార్థులకు ట్యాబ్ లు అందజేశారు.