హైదరాబాద్ (సెప్టెంబర్ – 10) : సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం (skltshu) రెండేళ్ల ఉద్యాన డిప్లొమా కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పదో తరగతి పాసై పాలీసెట్ – 2022లో అర్హత సాధించిన వారు ఈ డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు అర్హులని వర్సిటీ వీసీ నీరజ ప్రభాకర్ చెప్పారు.
సెప్టెంబర్ – 22 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు పాలిటెక్నిక్ కళాశాలల్లో 200 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ పాలిటెక్నిక్ ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో ఉండగా, మరో మూడు ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలు నల్లగొండ, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలో ఉన్నాయి.
ఈ డిప్లొమా కోర్సు పూర్తి చేసిన వారు హార్టీసెట్ ప్రవేశపరీక్ష ద్వారా 15 శాతం మందికి ఉద్యాన బీఎస్సీ చేసేందుకు అవకాశం కల్పించనున్నారు.
వెబ్సైట్ : http://www.skltshu.ac.in/dimploma_notification.php
Follow Us @