DAILY GK BITS IN TELUGU 25th JUNE
1) జయ భారత రెడ్డి కమిటీ ఏ అంశం కొరకు నియమించారు.?
జ : ఆంధ్రప్రదేశ్ లో నియామకాలు
2) తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు తెలంగాణ ఐక్య వేదికను ప్రారంభించడంలో కీలక వ్యక్తి ఎవరు.?
జ : బి. ప్రకాష్
3) తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటీ యొక్క ఒక అధ్యాయం చీకటి అధ్యాయంగా పిలవబడింది. ఎందుకంటే అధ్యాయాన్ని ప్రజలకు బహిర్గత పరచలేదు. అది ఏ అధ్యాయం.?
జ : 8వ అధ్యాయం
4) తెలంగాణ డిమాండ్ ను పరిశీలించడానికి ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు.?
జ : 2004
5) సిపాయిల తిరుగుబాటు సందర్భంగా యుద్ధం జరిగిన ప్రదేశాలను కాలానుగుణంగా అమర్చండి.? ఝాన్సీ, లక్నో, ఢిల్లీ, కాన్పూర్.?
జ : ఢిల్లీ, లక్నో, కాన్పూర్, ఝాన్సీ.
6) బెంగాల్ విభజనను చేసిన రాజ ప్రతినిధి ఎవరు.?
జ : కర్జన్
7) మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను ఏ సంవత్సరంలో అధికారికంగా ప్రకటించారు.?
జ : 1996
8) ఏ జిల్లాలో జోగిని వ్యవస్థ అసలు కనబడదు.?
జ : ఖమ్మం
9) గోల్కొండ కోట చుట్టూ ఎన్ని మహాద్వారాలు కలవు.?
జ : ఎనిమిది
10) ‘హంపి నుండి హరప్ప దాకా’ గ్రంథకర్త ఎవరు.?
జ : తిరుమల రామచంద్ర
11) మొహమ్మద్ ఘోరీని పృథ్వీరాజ్ చౌహాన్ ఏ యుద్ధంలో ఓడించాడు.?
జ : మొదటి తరైన్ యుద్ధం
12) ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు?
జ : రఘుపతి వెంకటరత్నం నాయుడు
13) భారత దేశానికి పోలీస్ వ్యవస్థను పరిచయం చేసింది ఎవరు.?
జ : కారన్ వాలిస్
14) తెలంగాణ జనసభ యొక్క అధికారిక పత్రిక పేరు ఏమిటి?
జ : జన తెలంగాణ
15) 1857 తిరుగుబాటు రావడానికి తక్షణ కారణం.?
జ : కొవ్వును పులిమిన తూటాల ఉదంతం
FOLLOW US
@YOUTUBE
@TELEGRAM
తాజా వార్తలు
DAILY GK BITS IN TELUGU 25th JUNE