20 ఆగస్టు 2022 కరెంటు అఫైర్స్ Q.A.

1) చంద్రుని మీదకు ప్రయాణం కోసం నాసా ఆగస్టు 29 న ప్రయోగించనున్న కార్యక్రమం పేరు ఏమిటి.?
జ : మిషన్ ఆర్టిమిషన్

2) 3D ప్రింటెండ్ కార్నియాను అభివృద్ధి చేసిన సంస్థ పేరు ఏమిటి.?
జ : ఎల్.వి. ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్

3) భారత వారెన్ బఫేట్ గా పేరు పొంది ఇటీవల మరణించిన వ్యాపరవేత్త ఎవరు.?
జ : రాకేష్ ఝున్ ఝున్ వాలా

4) 2017 లెక్కల ప్రకారం భారత్ లో ఏనుగుల సంఖ్య ఎంత.?
జ : 29,964

5) అండర్ – 20 రెజ్లింగ్ లో పసిడి పథకం సాదించిన తొలి భారత క్రీడాకారిణి గా ఎవరు నిలిచారు.?
జ : అంతిమ పంఘల్

6) లాన్సెట్ నివేదిక ప్రకారం 2019లో ధూమపానం, మద్యపానం, అధిక బరువు కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతమంది మరణించారు.?
జ : 44 లక్షల మంది

7) ఇటీవల బానిసత్వం పై ఐరాస మానవ హక్కుల మండలి విడుదల చేసిన నివేదిక పేరు ఏమిటి.?
జ : బానిసత్వపు సమకాలీన రూపాలు, వాటి ఉనికికి కారణాలు, ప్రభావాలు.

8) హెచ్.ఎస్.బీ.సీ నివేదిక ప్రకారం 2030 నాటికి భారత్ లో కోటీశ్వరుల సంఖ్య ఎంత.?
జ : 60 లక్షలు

9) ఇటీవల ఏ యూనివర్సిటీ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కి గౌరవ డాక్టరేట్ అందించింది.?
జ : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ

10) నాబార్డు నూతన చైర్మన్ గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : మహమ్మద్ ముస్తాఫా

11) ఓడీఎప్ ప్లస్ స్థాయి పొందిన రాష్ట్రాలలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది.?
జ : తెలంగాణ

12) కేంద్రం ఇటీవల విడుదల చేసిన అంచనాల ప్రకారం 2021- 22 లో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత.?
జ : 315.72 మిలియన్ టన్నులు

13) భారత ఒలింపిక్ సంఘం వ్యవహారాలు చూసేందుకు ఏర్పాటు చేసిన కమీటీలో సభ్యులు ఎవరు.?
జ : అనిల్ దవే, ఖురేషీ, వికాస్ స్వరూప్

14) రష్యా ప్రభుత్వం ప్రవేశపెట్టిన మదర్ హీరోయిన్ పథకం లక్ష్యం ఏమిటి.?
జ : ప్రతి తల్లి 10 మంది పిల్లలను కనడం

Comments are closed.