హైదరాబాద్ (ఆగస్టు 01) : కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను వీలయినంత త్వరగా పూర్తిచేయాలని “కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఫోరం – తెలంగాణ” సభ్యులు కన్వీనర్ సయ్యద్ జబీ ఆధ్వర్యంలో మంత్రి హరీష్ రావు ని కోరారు.
ఆదివారం మంత్రి హరీష్ రావును కలిసి వినతి పత్రం సమర్పించి… సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం క్రమబద్ధీకరణను వేగవంతం చేయాలని విజ్ఞప్తిచేశారు. మంత్రి సానుకూలంగా స్పందించారని జబీ తెలిపారు.