హైదరాబాద్ (జనవరి – 19) : తెలంగాణ ఇంటర్మీడియట్ కమీషనరేట్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పని చేస్తున్న కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ లు, పార్ట్ టైమ్/ మినిమం ఆఫ్ టైం స్కేల్ లెక్చరర్ లు, ఔట్సోర్సింగ్ సిబ్బంది సర్వీస్ లను 2022 – 23 విద్యా సంవత్సరానికి రెన్యూవల్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ జీవో నంబర్ 33 ను జారీ చేసింది.
ఈ ఉత్తర్వులు ద్వారా మొత్తం 3,722 మందిని రెన్యూవల్ చేయగా… కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ లు 3,541, పార్ట్ టైం లెక్చరర్ లు 103, ఔట్సోర్సింగ్ సిబ్బంది 78 మంది ఉన్నారు.