హైదరాబాద్ (ఫిబ్రవరి – 06) : తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను ఏప్రిల్ 2023 నుంచి క్రమబద్ధీకరించనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రకటించారు.
గత బడ్జెట్ సమావేశాలలో సీఎం కేసీఆర్ 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడానికి నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వివిధ శాఖలలో కాంట్రాక్టు ఉద్యోగుల జాబితాలు సిద్ధం చేసి ఉంచడం జరిగింది. కాంట్రాక్టు ఉద్యోగులు ఎక్కువగా విద్య, వైద్య రంగాలలోని ఉన్నారు.
Follow Us @