ఒడిశా (అక్టోబర్ – 15) : కాంట్రాక్టు రిక్రూట్మెంట్ విధానాన్ని శాశ్వతంగా రద్దు చేస్తూ ఆ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు.
ప్రస్తుతం పని చేస్తున్న 57,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులందరినీ దీపావళి సందర్భంగా రెగ్యులరైజ్ చేస్తామని, ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్ను విడుదల చేస్తామని పట్నాయక్ వెల్లడించారు.