BIKKI NEWS (JUNE 15) : తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ మరియు గౌరవ వేతనంతో పని చేస్తున్న సిబ్బందిని జులై 31వ తేదీ వరకు కొనసాగించాలని (contract and out sourcing employees renewal) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
contract and out sourcing employees renewal
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ మరియు గౌరవ వేతనంతో పనిచేస్తున్న సిబ్బంది యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ మార్చి 31తో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి సేవలను జూలై 31 వరకు కొనసాగిస్తూ ఆర్థిక శాఖ మెమో జారీ చేసింది.
అలాగే ఇక ఈ తాత్కాలిక ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందేలా సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వుల ద్వారా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, గౌరవ వేతనం, ఎంటిఎస్, పార్ట్ టైం, పుల్ టైం, గెస్ట్, హవర్లీ బేసిస్, దినసరి కార్మికులుకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేశారు.