హైదరాబాద్ (ఆగస్టు – 12) : ఈ నెల 19, 20 తేదీల్లో రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు జిల్లాల పర్యటన చేపట్టనున్నారు.
మెదక్ జిల్లా పర్యటన:
ఈనెల 19వ తేదీన (శనివారం) మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పోలీసు (ఎస్పీ) కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు.
సూర్యాపేట జిల్లా పర్యటన:
ఈ నెల 20వ తేదీన (ఆదివారం) ముఖ్యమంత్రి గారు సూర్యాపేట జిల్లా పర్యటన చేపట్టనున్నారు. పర్యటనలో భాగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారు. అనంతరం సూర్యాపేట జిల్లా పోలీసు (ఎస్పీ) కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు.
అదే సందర్భంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా నూతనంగా నిర్మించిన మెడికల్ కాలేజీ ప్రారంభంకానుంది.