హైదరాబాద్ (జూలై – 21) : జూనియర్ లెక్చరర్ స్పౌజ్ బదిలీల కారణంగా స్థానచలనం పొందిన ఆరుగురు కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లకు నూతన కళాశాలల్లో పోస్టింగ్స్ ఇస్తూ ఇంటర్మీడియట్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రపతి ఉత్తర్వులు 2018 ప్రకారం నూతన జోనల్ విధానంలో ఉద్యోగులను బదిలీల్లో భాగంగా స్పౌజ్ బదిలీలకు అవకాశం కల్పించారు.
