BIKKI NEWS (JAN. 17) : కేంద్ర మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MHRD) అందించే సెంట్రల్ సెక్టార్ స్కాలర్షిప్ (central sector merit scholarship with inter marks) కింద 2024 విద్యా సంవత్సరానికి నూతనంగా దరఖాస్తు చేసుకోవడానికి మరియు రెన్యువల్ కొరకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డ్ ఒక ప్రకటనలో తెలిపింది.
central sector merit scholarship with inter marks
2024 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థులు స్కాలర్షిప్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్ మార్కులు సాదించిన 59355 మంది విద్యార్థుల జాబితాను ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది. ఈ విద్యార్థులు కింద ఇవ్వబడిన లింకు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
నీ స్కాలర్షిప్ కింద గ్రాడ్యుయేట్ కోర్సులో చేరిన అభ్యర్థులకు సంవత్సరానికి దాదాపు 20వేల వరకు ఉపకార వేతనంను కేంద్ర ప్రభుత్వం అందించనుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం అందించే స్కాలర్షిప్ కు ఆదనంగా ఉండనుంది.
విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి గడువు జనవరి 19- 2025 వరకు కలదు. విద్యాసంస్థల రిజిస్ట్రేషన్ కొరకు 23 జనవరి – 2025 వరకు గడువు కలదు.