MJPTSW BC RJC CET : నేడే ఇంటర్ బీసీ గురుకులాల ప్రవేశ పరీక్ష

హైదరాబాద్ (ఏప్రిల్ 30) : తెలంగాణ రాష్ట్ర మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల విద్యాలయాల్లో(MJPTSW BC RJC CET 2023 ) ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం నేడు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోని 277 సెంటర్లలో ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరపనున్నారు.

ఈ ప్రవేశ పరీక్షల ద్వారా ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం కోర్సులలో అడ్మిషన్లు కల్పించనున్నారు.

255 ఇంటర్ బీసీ గురుకులాల్లో 22,400 సీట్లుండగా, దాదాపు 58,113 దరఖాస్తు చేసుకున్నారు.

హల్ టికెట్ల కోసం క్లిక్ చేయండి