హైదరాబాద్ (డిసెంబర్ – 09) : ప్రపంచవ్యాప్తంగా 2022వ సంవత్సరంలో అత్యధిక ప్రభావం చూపిన 100 మంది ప్రభావశీల మహిళలతో ప్రముఖ వార్తాసంస్థ బీబీసీ రూపొందించిన జాబితాలో నలుగురు భారతీయులు చోటు దక్కించుకున్నారు.
- ప్రముఖ నటి-నిర్మాత ప్రియాంకా చోప్రా జోనాస్,
- ఏరోనాటికల్ ఇంజినీర్ శిరీష బండ్ల,
- బుకర్ ప్రైజ్ విజేత గీతాంజలి శ్రీ
- సామాజిక ఉద్యమకారిణి స్నేహ జవాలేలు
వీరంతా తమ తమ రంగాల్లో స్ఫూర్తిదాయక విజయాలు సాధించినట్లు బీబీసీ తెలిపింది.