DadaSaheb Phalke – ఆశా ఫారేఖ్ కు అవార్డు

న్యూడిల్లీ (సెప్టెంబర్ – 27) : ప్రతిష్ఠాత్మకంగా భారతీయ సినిమా అవార్డ్ ‘దాదా సాహెబ్ ఫాల్కే’ ( DadaSaheb Phalke award 2020) కి గాను బాలీవుడ్ ప్రముఖ నటి పద్మశ్రీ ఆశా పరేఖ్ ఎంపికైనట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం ప్రకటించారు.

2020 సంవత్సరానికిగాను ఆమె ఆ అవార్డును అందుకోనున్నారు. 68వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్ లో భాగంగా సెప్టెంబరు 30న కేంద్ర ప్రభుత్వం ఆశా పరేఖ్ కు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.

Comments are closed.