విజయవాడ (జూన్ – 06) : ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2023 (AP PGCET 2023 EXAMS) ను నేటి నుండి జూన్ 10వ తేదీ వరకు రోజుకు మూడు సెషన్స్ చొప్పున నిర్వహించనున్నారు.
జూన్ – 06 నుంచి 10 వరకు 5 రోజుల పాటు మూడు షిప్ట్ ల చొప్పున ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నారు.
మొదటి షిప్ట్ ఉదయం 9:30 నుండి 11.00 గంటల వరకు, రెండో షిప్ట్ మధ్యాహ్నం 01.00 నుండి 02.30 వరకు, మూడో షిప్ట్ సాయంత్రం 4.30 నుండి 6.30 వరకు నిర్వహించనున్నారు.