GROUP 1 – 2018 మెయిన్స్ రద్దు – హైకోర్టు

BIKKI NEWS (MARCH 13) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2018లో నిర్వహించిన గ్రూప్ – 2 మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు, అలాగే ఎంపికైన అభ్యర్థుల జాబితాను కూడా రద్దు చేస్తున్నట్లు (AP HIGH COURT CANCELLED 2018 GROUP 1 MAINS EXAM) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది.

మెయిన్స్ పరీక్ష పత్రాలను డిజిటల్ వాల్యూషన్ మరియు పలుమార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించగా నేడు ఈ తీర్పును వెలువరించింది.

ఆరు వారాల్లోగా గ్రూప్ – 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించి, నియామకాలు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అయితే ఇప్పటికే విధుల్లో చేరిన అభ్యర్థులు ఎవరు ఆందోళన చెందవద్దని హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఎంపికై విధులు నిర్వహిస్తున్న ప్రస్తుత అభ్యర్థుల తరఫున ప్రభుత్వం న్యాయపోరాటం చేస్తుందని ప్రకటనలో తెలిపింది.